+91 95819 05907

రాచూరుపల్లి నూతన సర్పంచ్ ధనలక్ష్మిని అభినందించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సున్నం నాగమణి

రాచూరుపల్లి నూతన సర్పంచ్ ధనలక్ష్మిని అభినందించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సున్నం నాగమణి

నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, డిసెంబర్, 18: దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామంలోని రాచూరుపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మద్దతుతో ఘన విజయం సాధించిన కొనుసోతు ధనలక్ష్మికి ఘన సన్మానం జరిగింది. బుధవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు, ములకలపల్లి మాజీ జెడ్పిటిసి సున్నం నాగమణి పాల్గొని నూతన సర్పంచ్‌ను శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సున్నం నాగమణి మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ, ప్రజాదరణ పొందిన నాయకులను ప్రజలు ఆదరిస్తారని ఈ విజయం నిరూపించిందన్నారు. రాచూరుపల్లి గ్రామ అభివృద్ధికి నూతన సర్పంచ్ తన వంతు కృషి చేస్తారని ఆకాంక్షించారు. గ్రామంలోని ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందేలా, మౌలిక వసతుల కల్పనలో రాచూరుపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆమె సూచించారు. ​విజయం సాధించిన ధనలక్ష్మి మాట్లాడుతూ తన గెలుపుకు సహకరించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !