రాచూరుపల్లి నూతన సర్పంచ్ ధనలక్ష్మిని అభినందించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సున్నం నాగమణి
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, డిసెంబర్, 18: దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామంలోని రాచూరుపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మద్దతుతో ఘన విజయం సాధించిన కొనుసోతు ధనలక్ష్మికి ఘన సన్మానం జరిగింది. బుధవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు, ములకలపల్లి మాజీ జెడ్పిటిసి సున్నం నాగమణి పాల్గొని నూతన సర్పంచ్ను శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సున్నం నాగమణి మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ, ప్రజాదరణ పొందిన నాయకులను ప్రజలు ఆదరిస్తారని ఈ విజయం నిరూపించిందన్నారు. రాచూరుపల్లి గ్రామ అభివృద్ధికి నూతన సర్పంచ్ తన వంతు కృషి చేస్తారని ఆకాంక్షించారు. గ్రామంలోని ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందేలా, మౌలిక వసతుల కల్పనలో రాచూరుపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆమె సూచించారు. విజయం సాధించిన ధనలక్ష్మి మాట్లాడుతూ తన గెలుపుకు సహకరించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.









