రైతులు సాలోభ్యం కోసమే ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్: ఎస్ విజయ్ చంద్రం
నేటి గదర్ చింతకాని ప్రతినిధి:
రైతుల సాలభ్యం కోసమే ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ మధిర వ్యవసాయ సంచాలకులు ఎస్ విజయ్ చంద్రం అన్నారు. శుక్రవారం మండల పరిధిలో చింతకాని కొదుమూరు పర్యటించారు. ఈ సందర్భంగా విజయచంద్రం మాట్లాడుతూప్రస్తుత యాసంగి సీజన్లో యూరియా కొనుగోలు చేయుటకు వ్యవసాయ శాఖ తీసుకువచ్చిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ గురించి వివరించారు. గత వాన కాలంలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యాప్ ను అమలులోకి తీసుకురావడం జరిగింది అని వివరించారు. రైతులు ఈ యాప్ ద్వారా జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియాను వారి యొక్క పంటను బట్టి వారికున్న విస్తీర్ణాన్ని బట్టి జిల్లాలో ఏ డీలర్ అయినా ఏ సొసైటీలో అయినా అందుబాటులో ఉన్న యూరియాను బుక్ చేసుకోవచ్చని అని అన్నారు. ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత 24 గంటల లోపు ఆ రైతు బుక్ చేసుకున్న డీలర్ దగ్గరికి వెళ్లి కొనుగోలు చేయవచ్చు అని . ఏదైనా పరిస్థితులలో 24 గంటల లోపు యూరియాను తీసుకోనట్లయితే ఆ యొక్క బుకింగ్ రద్దు అవుతుంది అని మళ్లీ రైతులు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అని సూచించారు. అదేవిధంగా పట్టాదారులు, పట్టా పుస్తకాలు లేని వాళ్ళు మరియు కౌలు రైతులు యూరియాను బుక్ చేసుకునే వెసులుబాటు అవకాశం ఉందని అన్నారు .ఈ యొక్క యాప్ ను రైతులకు అలవాటు చేయటానికి మరియు అవగాహన కల్పించడానికి ప్రతి ఔట్లెట్ దగ్గర వ్యవసాయ శాఖ ద్వారా ఒక వ్యక్తిని నియమించడం జరుగుతుంది లేదా సంబంధిత ఏఈ ఓ రైతులకు సహాయం చేయడం జరుగుతుంది అని సూచించారు. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క యాప్ను వినియోగించుకొని యూరియాను కొనుగోలు చేయవచ్చు అని సూచించారు. ఈ క్రింద తెలిపిన లింకు ద్వారా యాప్ను ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సోములపల్లి మానస, సొసైటీ సీఈవో మారగని శ్రీనివాస రావు, వ్యవసాయ విస్తరణ అధికారులు తేజ, ఆయేషా మరియు రైతులు పాలొన్నారు









