మత్స్యావతారంలో భద్రాద్రి రాముడు…
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల వరుసలో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. ఈ అవతారానికి సంబంధించి రెండు గాధలు పురాణాలలో ఉన్నాయి. ఒకటి జ్ఞాననిధులైన వేదాలను బ్రహ్మ నుండి అవహరించి సముద్రంలో దాగిఉన్న సోమకాసురుని సహకరించడానికై మత్స్యావతారం ధరించి, వేదాలను ఉద్ధరించాడు. రెండవది జలప్రళయం నుండి నావలో ఉన్న వైవస్వత మనువును, సప్త ఋషులను, సృష్టికి అవసరమైన విత్తనాలను, ఔషధులను రక్షించాడు. ఈ అవతారాన్ని పూజించుట వలన కేతుగ్రహ బాధలు తొలగుతాయి అని భక్తుల భావన. ఈనెల 29న పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవం, 30న ఉత్తర ద్వార దర్శనం వేడుకలు నిర్వహించనున్నారు.









