జమ్మిగూడెం నూతన పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం: సోమవారం ఉదయం 9 గంటలకు మహోత్సవం
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్:దాది చంటి) డిసెంబర్, 21: అశ్వారావుపేట మండలం, జమ్మిగూడెం గ్రామ పంచాయతీ నూతన ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకార మహోత్సవం 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో అత్యంత వైభవంగా జరగనుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మరియు ప్రజాప్రతినిధుల విన్నపం మేరకు అపాయింటెడ్ డే డిసెంబర్ 22వ తేదీని ఖరారు చేస్తూ నూతన సర్పంచ్ ముద్దిన వెంకట నర్సమ్మ, ఉప సర్పంచ్ దండి వెంకటేశ్వరరావు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో సర్పంచ్గా ముద్దిన వెంకట నర్సమ్మ, ఉప సర్పంచ్గా దండి వెంకటేశ్వరరావుతో పాటు వివిధ వార్డుల సభ్యులుగా ఎన్నికైన దానపు భాగ్య రాజు (1వ వార్డు), గణప పుల్లమ్మ (2వ వార్డు), దానపు రాజమ్మ (3వ వార్డు), ముద్దిన రాంబాబు (4వ వార్డు), దాది ముక్తేశ్వరి (5వ వార్డు), దండి వెంకటేశ్వరావు (6వ వార్డు), సోమిని రాజేశ్వరి (7వ వార్డు), మరియు రెడ్డి జ్యోతి (8వ వార్డు) తమ పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. గతంలో ప్రకటించిన తేదీలో స్వల్ప మార్పు జరిగినందున, గ్రామ ప్రజలు, పెద్దలు, వార్డు సభ్యులు మరియు పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించి సోమవారం ఉదయం జరిగే ఈ అధికారిక కార్యక్రమానికి భారీ సంఖ్యలో విచ్చేసి నూతన పాలకవర్గానికి ఆశీస్సులు అందజేయాలని వారు కోరారు.









