భక్తిశ్రద్ధలతో వనలింగేశ్వర స్వామి దర్శనం
వేదాంతపురంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సున్నం నాగమణి
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్ట్రర్: దాది చంటి) డిసెంబర్ 21: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని వేదాంతపురం గ్రామంలో వెలసిన శ్రీ వన దుర్గాంబిక సమేత వన లింగేశ్వర స్వామి (గంగానమ్మ తల్లి) వారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు, ములకలపల్లి మాజీ జెడ్పిటిసి సున్నం నాగమణి వేదాంతపురం గ్రామాన్ని సందర్శించి, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. లోకకల్యాణం కోసం, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వేదాంతపురం సర్పంచ్ శ్రీమతి తోట వెంకటమ్మ, ఉప సర్పంచ్ సంగీత వీర్రాజు, కాలాస్త్రి, మాజీ సర్పంచ్ ప్రసాద్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









