+91 95819 05907

ఘనంగా వై.ఎస్. జగన్ 54వ జన్మదిన వేడుకలు

ఘనంగా వై.ఎస్. జగన్ 54వ జన్మదిన వేడుకలు

​ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ నాయకులు సోయం వీరభద్రం

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట (రిపోర్టర్: దాది చంటి ) డిసెంబర్, 21: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి 54వ జన్మదిన వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ములకలపల్లి మండలం జగన్నాధపురం మరియు దమ్మపేట మండల కేంద్రాల్లో వైఎస్ఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలకు అశ్వరావుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ వీరాభిమాని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోయం వీరభద్రం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానుల మధ్య సోయం వీరభద్రం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో విద్య, వైద్యం, మరియు సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. రాబోయే 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో వైఎస్ఆర్ అభిమానులు సోయం కృష్ణ, బొల్లిపల్లి సురేష్, లోకేంద్ర, సురభి సత్యం, వాసు, హరీష్, తాటి రమణ, దారా యుగేంధర్, పాకనాటి శ్రీను, చారుగుండ్ల ప్రదీప్ కుమార్, అన్నారపు నాగేంద్ర కుమార్ తో పాటు పెద్ద సంఖ్యలో జగనన్న అభిమానులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !