ఘనంగా వై.ఎస్. జగన్ 54వ జన్మదిన వేడుకలు
ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ నాయకులు సోయం వీరభద్రం
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట (రిపోర్టర్: దాది చంటి ) డిసెంబర్, 21: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి 54వ జన్మదిన వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ములకలపల్లి మండలం జగన్నాధపురం మరియు దమ్మపేట మండల కేంద్రాల్లో వైఎస్ఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలకు అశ్వరావుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ వీరాభిమాని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోయం వీరభద్రం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానుల మధ్య సోయం వీరభద్రం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో విద్య, వైద్యం, మరియు సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. రాబోయే 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో వైఎస్ఆర్ అభిమానులు సోయం కృష్ణ, బొల్లిపల్లి సురేష్, లోకేంద్ర, సురభి సత్యం, వాసు, హరీష్, తాటి రమణ, దారా యుగేంధర్, పాకనాటి శ్రీను, చారుగుండ్ల ప్రదీప్ కుమార్, అన్నారపు నాగేంద్ర కుమార్ తో పాటు పెద్ద సంఖ్యలో జగనన్న అభిమానులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.









