డైరీ ఫామ్ పై అవగాహన కార్యక్రమం
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
ఖమ్మం జిల్లా చింతకాని మండలం తిర్లాపురం గ్రామంలో గ్రామపంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఇంద్ర డైరీ ఫామ్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వీరబాబు మాట్లాడుతూ ప్రధానంగా దళిత బంధు పథకంలో, కూడా డైరీ ఫామ్ , మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు అని అన్నారు .ఇందిరా మహిళా డైరీ పథకం తెలంగాణ ప్రభుత్వం 2023 చివర్లో/2024 ప్రారంభంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రారంభించిన ఒక ప్రధాన చొరవతో .మధిర నియోజకవర్గంలో అమలు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనే ప్రణాళికతో ప్రారంభించబడింది అని,గ్రామీణ ప్రాంతాల్లోని 3 లక్షలు సహాయంతో మహిళలకు సబ్సిడీలతో పాడి పశువులను (ఆవులు/గేదెలు) అందించడం, సూక్ష్మ డైరీ యూనిట్లను సృష్టించడం, పశుగ్రాసం సరఫరాకు మద్దతు ఇవ్వడం మరియు స్థానిక పాల ఉత్పత్తి మరియు ప్రాసెసింగ్ను అభివృద్ధి చేయడం, జీవనోపాధిని మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంచడం ద్వారా సాధికారత కల్పించడానికి ఉద్దేశించబడింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో .చింతకానిమండలండైరీఫామ్APMసెక్రెటరీనాగపుల్లారావు, CC లు వెంకటేశ్వర్లు.ఝాన్సీ, గ్రామ దీపిక సావిత్రి.గోగుల నరసింహారావు, గోదా ప్రసాద్. గోదా వెంకన్న, గ్రామీణ మహిళ సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.









