+91 95819 05907

కొత్త మేడేపల్లి గ్రామ గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి..బానోతు మంజుల మదన్ లాల్

కొత్త మేడేపల్లి గ్రామ గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి..బానోతు మంజుల మదన్లాల్.

నేటి గదర్ న్యూస్, వైరా/ ఏన్కూరు:
ఏన్కూర్ మండల పరిధిలోని మేడేపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఉన్న కొత్త మే డేపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న గుత్తి కోయ గిరిజనుల సమస్యలను వెం టనే ప్రభుత్వం పరిష్కరించాలని బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు బానోతు మంజుల మదన్ లాల్ డిమాండ్ చేశారు.కొత్త మేడిపల్లి గ్రామాన్ని బిఆర్ఎస్ మండల నాయకులతో కలిసి బానోతు మంజుల మదన్లాల్ సందర్శించారు. అక్కడ వారు నివాసం ఉన్న ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు.ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న గుత్తి కోయ కుటుంబాలను కలుసుకొని వారు పడుతున్న బాధలను అడిగి తెలుసుకున్నారు.అక్కడ ఉన్న గిరిజనులు మా గ్రామంలో కరెంట్ లేకపోవడంతో అష్ట..కష్టాలతో..రాత్రి వేళ చీకట్లో కునారీళ్లుతూ బాధ లు పడుతున్నామని..మాకు ఈ సమస్యను తీర్చమని ఆమెను గిరిజనులు అడగగా..వెంటనే స్పందించిన బానోతు మంజుల మదన్ లాల్ త్వరలో ఎని మిది సోలార్ ప్యానల్స్ ను ఏర్పాటు చేస్తానని వారికి హామీ నిచ్చారు.గతం లో బానోతు మదన్ లాల్ ఉన్నప్పుడు మా గ్రామానికి బోరు కావాలని దరఖా స్తు పెట్టుకుంటే వెంటనే..స్పందించిన ఆయన అధికారులతో మాట్లాడి మా గ్రా మానికి బోర్ వేయించినారు అని ఆమె దృష్టికు గిరిజనులు తీసుకొచ్చారు. మా గ్రామములో అనేక సమస్యలు ఉన్నా గాని అధికారులు మాత్రం పట్టిం చుకోవడం లేదని ఆమె దృష్టికి తీసుకొచ్చారు.మా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆమె ముందు మొర పె ట్టుకున్నారు.అధికారులకు ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా గాని స్పందించడం లేదని గిరిజనులు ఆమె ముందు వాపోయారు.గిరిజనులు పడుతున్న బాధ లను విని బానోతు మంజుల మదన్ లాల్ చెలించి పోయారు.త్వరలోనే మీ గ్రామ సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసు కువెళ్లి సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తానని వారికి హామీని ఇచ్చారు.ఈ సందర్భంగా బానోతు మంజుల మదన్ లాల్ మాట్లాడుతూ..ప్రభుత్వ అధికారులు ఈ గ్రామాన్ని సందర్శించి..గుత్తి కోయ గిరిజనులు పడుతున్న బాధలను అర్థం చేసుకొని వారి సమస్యలను పరిష్కరించాలని ఆమె కోరారు.ఈ కార్య క్రమంలో బిఆర్ ఎస్ మండల అధ్యక్షుడు వాసిరెడ్డి వెంకటేశ్వరరావు,నాయకులు మల్లెంపాటి మాధవరావు,చీట్ కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ విజయ కుమారి,అజ్మీర నరసింహారావు,రవి రైలు,నరసింహారా వు,ముదిగొండ గారునాగేశ్వరరావు రమేష్ శివ గౌడ్ నరసరావు ,ముత్తయ్య,గణేష్ బాబు బుల్లయ్య బండ కృష్ణ గడ్డం వెంకటేశ్వర్లు ,తదితరులు పాల్గొ న్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !