కొత్త మేడేపల్లి గ్రామ గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి..బానోతు మంజుల మదన్లాల్.
నేటి గదర్ న్యూస్, వైరా/ ఏన్కూరు:
ఏన్కూర్ మండల పరిధిలోని మేడేపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఉన్న కొత్త మే డేపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న గుత్తి కోయ గిరిజనుల సమస్యలను వెం టనే ప్రభుత్వం పరిష్కరించాలని బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు బానోతు మంజుల మదన్ లాల్ డిమాండ్ చేశారు.కొత్త మేడిపల్లి గ్రామాన్ని బిఆర్ఎస్ మండల నాయకులతో కలిసి బానోతు మంజుల మదన్లాల్ సందర్శించారు. అక్కడ వారు నివాసం ఉన్న ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు.ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న గుత్తి కోయ కుటుంబాలను కలుసుకొని వారు పడుతున్న బాధలను అడిగి తెలుసుకున్నారు.అక్కడ ఉన్న గిరిజనులు మా గ్రామంలో కరెంట్ లేకపోవడంతో అష్ట..కష్టాలతో..రాత్రి వేళ చీకట్లో కునారీళ్లుతూ బాధ లు పడుతున్నామని..మాకు ఈ సమస్యను తీర్చమని ఆమెను గిరిజనులు అడగగా..వెంటనే స్పందించిన బానోతు మంజుల మదన్ లాల్ త్వరలో ఎని మిది సోలార్ ప్యానల్స్ ను ఏర్పాటు చేస్తానని వారికి హామీ నిచ్చారు.గతం లో బానోతు మదన్ లాల్ ఉన్నప్పుడు మా గ్రామానికి బోరు కావాలని దరఖా స్తు పెట్టుకుంటే వెంటనే..స్పందించిన ఆయన అధికారులతో మాట్లాడి మా గ్రా మానికి బోర్ వేయించినారు అని ఆమె దృష్టికు గిరిజనులు తీసుకొచ్చారు. మా గ్రామములో అనేక సమస్యలు ఉన్నా గాని అధికారులు మాత్రం పట్టిం చుకోవడం లేదని ఆమె దృష్టికి తీసుకొచ్చారు.మా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆమె ముందు మొర పె ట్టుకున్నారు.అధికారులకు ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా గాని స్పందించడం లేదని గిరిజనులు ఆమె ముందు వాపోయారు.గిరిజనులు పడుతున్న బాధ లను విని బానోతు మంజుల మదన్ లాల్ చెలించి పోయారు.త్వరలోనే మీ గ్రామ సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసు కువెళ్లి సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తానని వారికి హామీని ఇచ్చారు.ఈ సందర్భంగా బానోతు మంజుల మదన్ లాల్ మాట్లాడుతూ..ప్రభుత్వ అధికారులు ఈ గ్రామాన్ని సందర్శించి..గుత్తి కోయ గిరిజనులు పడుతున్న బాధలను అర్థం చేసుకొని వారి సమస్యలను పరిష్కరించాలని ఆమె కోరారు.ఈ కార్య క్రమంలో బిఆర్ ఎస్ మండల అధ్యక్షుడు వాసిరెడ్డి వెంకటేశ్వరరావు,నాయకులు మల్లెంపాటి మాధవరావు,చీట్ కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ విజయ కుమారి,అజ్మీర నరసింహారావు,రవి రైలు,నరసింహారా వు,ముదిగొండ గారునాగేశ్వరరావు రమేష్ శివ గౌడ్ నరసరావు ,ముత్తయ్య,గణేష్ బాబు బుల్లయ్య బండ కృష్ణ గడ్డం వెంకటేశ్వర్లు ,తదితరులు పాల్గొ న్నారు.









