సీయోను ప్రార్ధన మందిరం క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సర్పంచ్ తడికమళ్ల నాగార్జున
నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా మండలం ముసలిమడుగులో గురువారం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని స్థానిక సీ యోను ప్రార్ధన మందిరం నందు క్రిస్మస్ పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి .
క్రిస్మస్ వేడుకల్లో సర్పంచ్ తడికమళ్ల నాగార్జున ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. పాస్టర్ ఆదాం ప్రత్యేక ప్రార్థనలు సల్పినారు.
ఈ సందర్భంగా సర్పంచ్ తడికమళ్ల నాగార్జున మాట్లాడుతూ ప్రపంచంలోని సర్వమానవాళికి క్రీస్తు బోధనలు మార్గదర్శకం అనీ అన్నారు.యేసుని యొక్క దీవెనలు సమస్త జనులపై ఉండాలని ప్రార్థించారు . ప్రతి ఒక్కరూ ప్రేమ , దయ కనికరము క్షమా అనే గుణాలతో ఎదగాలని తెలిపారు. గ్రామ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలను తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో మండల కాంగ్రెస్ నాయకులు కొరివి నరసింహారావు, చింతానిప్పు శ్రీనివాసరావు,కొరివి కాటంరాజు, కేతావరపు వెంకటేశ్వర్లు,కొరివి సీతయ్య తదితరులు పాల్గొన్నారు.









