నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
మధిర డివిజన్ వ్యాప్తంగా యూరియా కొరత లేదని మధిర వ్యవసాయ సంచాలకులు ఎస్.విజయ్ చంద్ర అన్నారు. ప్రస్తుతం యాసంగి సీజన్ లో మధిర డివిజన్లో మొక్కజొన్న పంట అధికంగా సుమారు 73000 ఎకరాల్లో పండిస్తున్నారు మరియు 26 వేల ఎకరాల్లో వరి పండిస్తున్నారు .రైతులకు కావాల్సిన యూరియా ఎప్పటికప్పుడు సొసైటీల ద్వారా ప్రైవేట్ డీలర్స్ ద్వారా సరఫరా చేయటం జరుగుతుంది అని అన్నారు. జిల్లాలో యూరియా నిల్వలు సరిపడినంత ఉన్నాయి. ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి సొసైటీలకు మరియు ప్రైవేటు డీలర్స్ కు జిల్లా జిల్లా వ్యవసాయ అధికారి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సరఫరా చేస్తున్నారు . కాబట్టి రైతులు ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని విజయ్ చంద్రం అన్నారు. రైతులు సిఫారసు చేసినంత యూరియా మాత్రమే వాడవలెను. అధికంగా యూరియా వాడిన వాడటం వలన ఎన్నో దుష్ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా భూ కాలుష్యం, వాతావరణ కాలుష్యం పెరిగి అలాగే పంటలకు రోగాలు అధికంగా వచ్చి రైతులకు సాగు ఖర్చు పెరిగే అవకాశం ఉంది కాబట్టి సిఫారసు చేసిన మోతాదు మాత్రమే యూరియాని పంటలకు వాడాలి. విజయ్ చంద్రం అన్నారు.









