ఖమ్మం జిల్లా జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. సీయోను ప్రార్థన మందిరంలో మాజీ ఎంపీటీసీ తడికమళ్ళ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
నేటి గదర్ న్యూస్, వైరా: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. మండలం లోని ముసలిమడుగు గ్రామంలో సీయోను ప్రార్థన మందిరంలో మాజీ ఎంపీటీసీ తడికమళ్ళ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, గ్రామంలో అన్నదానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. మండలంలోని ముసలిమడుగు గ్రామంలో మాజీ సర్పంచ్ చింత నిప్పు కరుణాకర్ రావు ఆధ్వర్యంలో పువ్వాళ దుర్గాప్రసాద్ అభిమానులు, యూత్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలోఅనుమోలు స్వామి, చింత నిప్పు నరసింహారావు, మాజీ సర్పంచ్ కరుణాకర్ రావు, నర్వనేని బుజ్జి, వాసిరెడ్డి రామారావు, నరవనేని యుగంధర్,కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు సత్తనపల్లి నరసింహారావు, చింత నిప్పు రమేష్, మంకెన్న వెంకటేశ్వరరావు,ఏడో వార్డు మెంబర్ కోలకాని దేవరాజు,తంబారపు నాగేశ్వరరావు ,తడికమళ్ళ రామారావు, ముసలిమడుగు సిండికేట్ యూత్ గ్రామస్తులు, తదితరు లు పాల్గొన్నారు.









