నేటి గదర్:
మణుగూరులో సీనియర్ రాజకీయ నాయకుడికి తక్షణ వైద్యం
మణుగూరులోని ప్రగతి హాస్పిటల్లో ఈరోజు బ్రెయిన్ స్ట్రోక్కు గురైన ఒక ప్రముఖ, సీనియర్ రాజకీయ నాయకుడికి అందించిన అత్యవసర వైద్య సేవలతో పెను ప్రమాదం తప్పింది.
స్ట్రోక్ లక్షణాలు కనిపించిన వెంటనే హాస్పిటల్కు తీసుకురాగా, డాక్టర్ మొయిద్దీన్ ఎం.డి. తక్షణమే స్పందించి చికిత్స ప్రారంభించారు. సమయానికి అందించిన వైద్య సేవల వల్ల ఆ వ్యక్తి పూర్తిస్థాయి పెరాలసిస్కు గురికాకుండా బయటపడ్డారని వైద్యులు తెలిపారు.
పేషెంట్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ప్రమాదం నుంచి బయటపడ్డాడని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా పేషంట్ తరఫు బంధువులు, వేగంగా స్పందించి ప్రాణాలను కాపాడిన డాక్టర్ మొయిద్దీన్తో పాటు ప్రగతి హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 118









