అశ్వారావుపేటలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యేలు.. మాజీ జెడ్పిటిసి కుటుంబానికి భరోసా
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్ : దాది చంటి) జనవరి 02: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మరియు అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు శుక్రవారం అశ్వారావుపేట పట్టణంలో పర్యటించారు. పట్టణానికి చెందిన మాజీ జెడ్పిటిసి సున్నం నాగమణి భర్త సున్నం సత్యనారాయణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నేతలు మధ్యాహ్నం 4 గంటలకు వారి నివాసానికి చేరుకుని సత్యనారాయణను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న నేతలు, ధైర్యంగా ఉండాలని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటారని ఆకాంక్షించారు. పార్టీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని వారు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంపూర్ణ, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి ఉపాధ్యాయుల ప్రకాష్, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, మాజీ జెడ్పిటిసి జూపల్లి రమణారావు పాల్గొన్నారు. వీరితో పాటు పార్టీ నాయకులు కాసాని చంద్రమోహన్, మందపాటి రాజమోహన్ రెడ్డి, సంక ప్రసాద్, వగ్గెల పూజ, జె. శ్రీరామ్ మూర్తి, బుక్య ప్రసాద్, నారం రాజశేఖర్, రఘురాం, దమ్మపేట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ రమేష్ మరియు అశ్వారావుపేట, దమ్మపేట మండలాల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.









