కలెక్టర్ నిర్ణయంతో రైతు సంఘం హర్షం.
యూరియా సరఫరా కేంద్రాలను నేరుగా పర్యవేక్షణ చేసిన కలెక్టర్, సిపి కృషి అభినందనీయం
జిల్లా రైతు సంఘం కార్యదర్శి, బొంతు రాంబాబు.
నేటి గదర్ న్యూస్, వైరా:- వైరా :-యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గ్రామాల వారీగా యూరియాను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేయడంతో ఖమ్మం జిల్లా కలెక్టర్ చొరవ తో ప్రభుత్వం గ్రామాల వారీగా యూరియా పంపిణీకి రంగం సిద్ధం చేసినట్లు రాంబాబు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు హర్షించదగ్గ విషయమని జిల్లా రైతు సంఘం కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. ప్రస్తుతం మొక్కజొన్న, తో పాటు రబీకి యూరియా ఎరువు అవసరం పడటంతో రైతులు మండల కేంద్రంలో సొసైటీల వద్ద, ప్రైవేట్ షాపుల దగ్గర బారులు తీరవలసిన పరిస్థితి ఉందని, రైతులు ఇబ్బందుల్లో దృష్టిలో ఉంచుకొని రైతు సంఘం తో పాటు అఖిలపక్ష రైతు సంఘం నాయకులు కలిసి సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పరిష్కారానికి చొరవ చూపడంతో జిల్లా రైతు సంఘం తరఫున కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీసు కమిషనర్ సునిల్ దత్త్ మండల, గ్రామాల్లో స్వయం గా శుక్రవారం పర్యటించి రైతులకు యూరియా సరఫరా లో సమస్యలు పరిష్కారం చేయటం అభినందనీయం అన్నారు.









