ముఖ్యఅతిథులుగా హాజరవుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, పోతినేని, నున్నా
కామేపల్లి లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం.
నేటి గదర్ న్యూస్, వైరా నియోజకవర్గప్రతి నిధి
భవిష్యత్ పోరాటాల రూపకల్పన కోసం సిపిఎం వైరా డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జనవరి 4న ఆదివారం మండల పరిధిలో జాస్తిపల్లి
గ్రామంలో వైరా డివిజన్ స్థాయి విస్తృత సమావేశం జరుగుతుందని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం తెలిపారు.
సిపిఎం కార్యాలయం కామేపల్లి లో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు దిగ్గి కృష్ణ, డివిజన్ కమిటీ సభ్యులు బాదావత్ శ్రీనివాస్,కొత్త శివరామకృష్ణ (చిన్న)తో కలిసి మాట్లాడారు. ప్రజా సమస్యలపై ఆందోళన పోరాటాలు, ఇంటింటికి సిపిఎం కార్యక్రమం విస్తృత స్థాయి సమావేశంలో పిలుపుయబోతున్నమని ఆయన తెలిపారు. విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథులుగా సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తో పాటు జిల్లా డివిజన్ నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు, డివిజన్వ్యాప్తంగా కారేపల్లి, ఏన్కూర్, వైరా మున్సిపాలిటీ, వైరా మండలం, కొణిజర్ల మండలం నుంచి 300 మంది ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు హాజరవుతున్నట్లు ఆయన వెల్లడించారు, ఆహ్వానితులంతా సకాలంలో హాజరై విస్తృత స్థాయి సమావేశం జయప్రదం చేయాలని అయన కోరారు.









