*
చెట్ల తిమ్మాయపల్లి ఉపాధ్యాయురాలు పాతూరి స్వప్నశ్రీ.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని చెట్ల తిమ్మయ్య పల్లి పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయురాలు పి స్వప్న శ్రీ కి అరుదైన అవార్డు దక్కింది. పూర్తి వివరాల్లోకి వెళితే సౌత్ ఇండియా బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్న డా,పాతూరి స్వప్నశ్రీ విద్య రంగంలో చేసిన విశిష్ట సేవలకు డా, పి. స్వప్నశ్రీ (హిందీ ఉపాధ్యాయురాలు చెట్లతిమ్మయి పల్లి మాసాయిపేట మండలం ) సౌత్ ఇండియా బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నారు. సావిత్రి బాయ్ పూలె జన్మదినం సందర్బంగా విజయవాడ లో తుమ్మల పల్లి కళాక్షేత్రం , గురు చైతన్య ఉపాధ్యాయ సంగం ఆధ్వర్యంలో జరిగింది.కార్యక్రమo లో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మహిళ ఉపాధ్యాయులు, గురు చైతన్య ఉపాధ్యాయ సంగం, బీసీవై అధ్యక్షులు రామచంద్ర యాదవ్,ప్రముఖులు పాల్గొన్నారు. ఈ అవార్డు అందుకున్నందుకు పి స్వప్నశ్రీ కి ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.









