_ *నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు యలమందల జగదీష్ , భూక్య ఉపేంద్ర బా యి*—————
నేటి గదర్ న్యూస్, ఖమ్మం జనవరి 3.2026 : *అణగారిన వర్గాల మహిళల చదువు ప్రాధాన్యతను గుర్తించడమే కాకుండా వారి చదువు కోసం నిరంతర ప్రయత్నాలు సాగించిన చదువుల మాత సావిత్రిబాయి పూలే అని నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు యలమందల సింగ్, వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్రబాయి లు కొనియాడారు. శనివారం వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి , జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేంద్ర ,,జగదీష్ లు మాట్లాడుతూ* సావిత్రిబాయి పూలే జయంతుల వర్ధంతి ల కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అప్పుడే వారిని స్మరించుకోవటం , వారి సేవలను కొనియాడటం మాత్రమే కాకుండా వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తొలుత సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ , ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బానోతు భద్రు నాయక్,బహుజన జేఏసీ నగర అధ్యక్షుడు పగిళ్లపల్లి నాగేశ్వరరావు , ఎల్ హెచ్ పి ఎస్ నాయకుడు వీరన్న నాయక్ , మీడియా ఇంచార్జ్ శ్రీనివాస చారి , టీజేఏసీ కన్వీనర్ అర్జునరావు , రఘునాధపాలెం ఎల్ హెచ్ పి ఎస్ ఇంచార్జి నాగేందర్ నాయక్ , మైనార్టీ గ్రామీణ వైద్యుల సంఘం వ్యవస్థాపకులు ఎస్.కె. నజీరుద్దిన్ ,
టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్.కె .సర్దార్, నగర నాయకుడు దేవుళ్ళ నాగేశ్వరరావు, వీర నారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా ఉపాధ్యక్షురాలు జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా *ప్రధాన కార్యదర్శి ఎస్కె . షరీఫా బేగం , కార్యదర్శి స్పందన , సహాయ కార్యదర్శి కవిత , నాయకులు కృష్ణవేణి, లక్ష్మి ,విజయ సుభద్ర, నాగేంద్ర ,సరోజిని ,రమ్య శ్రీదేవి లతో పాటు సాంస్కృతిక రథసారధి పమ్మి రవి తదితరులు పాల్గొన్నారు.*









