సావిత్రిబాయి స్పూర్తితో మహిళల హక్కుల కోసం పోరాడాలి.
మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాము
ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, సినీయర్ నాయకురాలు మచ్చా మణి.
నేటి గదర్ న్యూస్, వైరా:-
చదువుల తల్లి సావిత్రి భాయి పూలే స్ఫూర్తితో మహిళల హక్కుల కోసం పోరాడాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రి భాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, ఐద్వా సినీయర్ నాయకురాలు మచ్చా మణి అన్నారు. శనివారం వైరా బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సావిత్రి భాయి పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రి భాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐద్వా వైరా పట్టణ కార్యదర్శి తోట కృష్ణవేణి అధ్యక్షతన జరిగిన సభలో ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, సీనియర్ నాయకురాలు మచ్చా మణి మాట్లాడుతూ సావిత్రి భాయి పూలే సంఘం సంస్కర్తగా, ఉపాధ్యాయినిగా, రచయిత్రిగా నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన యోధురాలు అన్నారు. మహిళల విద్య ద్వారా సమాజంలో మార్పు వస్తుందని బలంగా నమ్మిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే అన్నారు. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించిందని, కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి శూద్రుల, అస్పృశ్యుతకి వ్యతిరేకంగా మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా భావించిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, పీడిత ప్రజలు, స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకరిణి అన్నారు. స్పూర్తితో మను వాదానికి వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాల్సిన అవసరం చాలా ఉందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 3 మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా వైరా పట్టణ నాయకులు కంసాని మల్లికాంబ, చావా కళావతి, మాదినేని రజిని, భూక్యా విజయ, మాడపాటి సుజాత, తాటి కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.









