నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
మండలపరిధిలోని నాగులవంచ గ్రామానికి చెందిన రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంబటిశాంతయ్యను,పాతర్లపాడు గ్రామానికి చెందినరిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్ కంచుమర్తి
పుల్లయ్యను వారి ఇళ్ల వద్ద నిద్రలోనే హౌస్ అరెస్టు చేసినారు. జిల్లా పెన్షనర్ సంఘ బాధ్యులైన వారిద్దరిని సోమవారం హైదరాబాదులో జరిగేచలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ఉండేందుకు వారిని అరెస్టు చేయడం జరిగింది. చింతకాని ఎస్సై వీరేంద్ర నాయకత్వంలో
చింతకాని పోలీసులు
అరెస్టు చేసినారు. వీరి అరెస్టు పట్ల రాష్ట్ర పెన్షనర్ సంఘం కన్వీనర్ కోహెద్ చంద్రమౌళి, కో కన్వీనర్ జయరాం, జిల్లా కన్వీనర్ మారుతి రామారావు, పి. ఆర్. టి. యు, యు.టి.ఎఫ్, ఏ.పీ.టీఎఫ్ సంఘాలు, జిల్లా పెన్షనర్ సంఘాలు ఖండించాయి. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా 39 సంవత్సరాలు కష్టపడి పని చేసినారని ,వారు దాచుకున్నటువంటి గ్రాటివిటీ, కమిటీ షన్, జిపిఎఫ్ ,ఈ ఎల్ ఎన్కాష్ మెంట్ వంటివి ఇవ్వకుండా, దరిదాపురిటైర్మెంట్ 24 నెలలు అయినప్పటికీ ఇంతవరకు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని వారు వివరించారు. రిటైర్మెంట్ అయిన మరుసటి రోజునే ఇవ్వవలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ 24 నెలలు గడిచిన ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. 63 సంవత్సరాల వయసులో చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే పోలీసుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడకక్కడ అరెస్టు చేయటం మంచి పద్ధతి కాదని వారు తెలిపారు .ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఏకకాలంలో విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.









