**
బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు.
నేటి గదర్ న్యూస్, వైరా:-
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు జనవరి 7వ తేది బుధవారం ఉదయం 10:00 గం:లకు ఖమ్మం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు మంగళవారం జూలూరుపాడు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులకు (సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు) ఆత్మీయ అభినందనసభ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈసభలో ముఖ్యఅతిథిగా కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారు పాల్గొని గ్రామ ప్రజాప్రతినిధులను శాలువాతో సత్కరించి, అభినందిస్తారన్నారు.
ఈ సభకు వైరా నియోజకవర్గ పరిధిలోని. మండల అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు ఎంపీటీసీలు మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయవలసిందిగా గిరిబాబు కోరారు.









