జనం చెంతకు జారె ఆదినారాయణ: గురువారం అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే ‘ప్రజా బాట’!
లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ.. విద్యుత్ ప్రమాద బాధితులకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్న ఎమ్మెల్యే జారే
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 08: అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం 7:30 గంటలకు దమ్మపేట మండలంలోని గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీతో పర్యటన ప్రారంభం కానుంది. అనంతరం 8 గంటలకు దిబ్బగూడెం-బాలరాజుగూడెం ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన ప్రీ-ప్రైమరీ స్కూల్ భవనాన్ని ప్రారంభించి, 9 గంటలకు అశ్వారావుపేటలో ‘సీఎం కప్’ టార్చ్ను ఘనంగా ప్రారంభించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు వెంకట్రాజుగూడెం-అఖినేపల్లిలో నిర్వహించే ‘విద్యుత్ ప్రజా బాట’ కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా, ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మరణించిన జుజుమ్ బంగారావు అశ్వారావుపేట, తంగేళ్లమూడి పోలయ్య రంగువారిగూడెం కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించి, ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్ వట్టి వెంకట్రావు కోరారు.









