+91 95819 05907

మెచ్చాకు కేటీఆర్ ‘ఆత్మీయ’ ఆలింగనం: అశ్వారావుపేటలో గులాబీ జోష్!

​పార్టీ బలోపేతంపై కేటీఆర్ ప్రశంసల జల్లు.. ఖమ్మం అభినందన సభలో ప్రత్యేక ఆకర్షణగా మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 07: ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ‘ఆత్మీయ అభినందన సభ’ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను గౌరవించేందుకు ఏర్పాటు చేసిన ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును కేటీఆర్ సాదరంగా ఆహ్వానించి, ఆత్మీయంగా అలింగనం చేసుకోవడం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు మెచ్చా పడుతున్న శ్రమను కేటీఆర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు. నియోజకవర్గంలోని రాజకీయ పరిణామాలు, కార్యకర్తల సంక్షేమంపై చర్చించిన కేటీఆర్ రాబోయే రోజుల్లో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా దిశానిర్దేశం చేశారు. జిల్లా ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలతో ఖమ్మం నగరం గులాబీమయంగా మారింది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !