నేటి గదర్ న్యూస్, ఎర్రుపాలెం ప్రతినిధి, 08/01/2026
ఎర్రుపాలెం మండలం, వెంకటాపురం ప్రాథమిక పాఠశాల నందు సంక్రాంతి సెలవులను పురస్కరించుకొని పాఠశాలలో
విద్యార్థులు మరియు వారి తల్లులకు కలిపి ముగ్గులు పోటీ నిర్వహించడం జరిగినది. ఈ పోటీలో
ప్రథమ బహుమతి రమ్య , ద్వితీయ బహుమతి సుప్రజ గెలుపొందడం జరిగినది.
అదేవిధంగా సాంస్కృతి సాంప్రదాయాలకు భిన్నంగా చిన్నారి విద్యార్థులకు “భోగి పళ్ళ “కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదనంతరం గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ECR 2.0 లో భాగంగా స్టార్ ఆఫ్ ద వీక్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగినది. దీనిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమొంటో మరియు సర్టిఫికెట్లు అందజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో గౌరవ మండల విద్యాశాఖ అధికారి బి మురళీమోహన్ రావు పాల్గొని విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో కలిసి పాఠశాలలో నిర్వహించే ఇంగ్లీష్ క్లాస్ గురించి, విద్యార్థుల ప్రతిభ పాటలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకోవడం జరిగింది.
అదేవిధంగా ఈ కార్యక్రమంలో వెంకటాపురం గ్రామ సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్ రెడ్డి , వెన్నపూస కృష్ణారెడ్డి , కర్నాటి సుధాకర్ రెడ్డి, వేముల వెంకటేశ్వరరావు, కోటిరెడ్డి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు
వెల్లంకి నాగరాజు, ఉపాధ్యాయులు రామారావు , కృష్ణవేణి, రమ్య, నాగరాణి లో పాల్గొనడం జరిగినది









