+91 95819 05907

మేడారం జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి -బీజేపీ డిమాండ్

​అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి భక్తుల కోసం ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని కోరిన నేతలు

నేటి గద్దర్ న్యూస్,​ దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 08: ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం అశ్వారావుపేట నియోజకవర్గం నుండి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నియోజకవర్గ బీజేపీ నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోని అన్ని మండలాల నుండి ఆదివాసీ బిడ్డలు, భక్తులు తమ ఆరాధ్య దైవాల దర్శనం కోసం భారీ సంఖ్యలో మేడారం వెళ్తారని పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వారి ప్రయాణ సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంతో పాటు ప్రధాన మండల కేంద్రాల నుండి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తంబళ్ల రవితో పాటు మహిళా నేతలు కారం రత్నకుమారి, ఆళ్ల సుజాత తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !