తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు మౌలానా షేక్ ముజాహిద్
మసీదు ప్రారంభోత్సవ సందర్భంగా ధార్మిక సభ
ఖమ్మం, జనవరి 9 : (నేటి గదర్ న్యూస్ )
ఈనెల 11న బోనకల్లు మండలం ముష్టికుంట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన మసీదు ప్రారంభోత్సవ సందర్భంగా జరిగే ధార్మిక సభను మధిర నియోజకవర్గ ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు మౌలానా షేక్ ముజాహిద్ కోరారు.ధార్మిక సభ ఆహ్వాన సంఘ సమావేశం శుక్రవారం మధిర జామియా మసీదులో జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ముష్టి కుంట వేదికగా జరిగే ముస్లిం ధార్మిక సభలో ఆధ్యాత్మిక గురువులు పాల్గొని ప్రసంగిస్తారని,ఈ సభలో ఖురాన్,ప్రవక్త ముహమ్మద్ బోధనలను ఎలా అనుసరించాలి,శాంతి, సౌభ్రాతృత్వం,నీతివంతమైన జీవితం గడిపేలా ప్రసంగం ఉంటుందని,మనిషి నూతన జీవితానికి ఈ సభ ఒక వేదిక కాబోతుందన్నారు.ధార్మిక సభకు మహారాష్ట్రకు చెందిన గురువులు
హజరత్ మౌలానా రిజ్వానుద్దీన్ సాహెబ్, ఆంధ్ర ప్రదేశ్ చెందిన మరో గురువులు హజరత్ మౌలానా అబ్దుల్ ముస్తాన్ సాహెబ్ నద్వి పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సభలో వేలాదిగా పాల్గొని జయప్రదం చేయగలరని కోరారు.ఈ సమావేశంలో ముస్లిం ఐక్య సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు జనాబ్ షేక్ హుస్సేన్ సాహెబ్,ప్రధాన కార్యదర్శి జనాబ్ షేక్ మొహమ్మద్ గౌసుద్దీన్, జాయింట్ సెక్రెటరీ సయ్యద్ కరీం,మధిర మండల కమిటీ అధ్యక్షులు జనాబ్ షేక్ గాలిబ్ సాహెబ్, బోనకల్ మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ పాషా,మధిర టౌన్ కమిటీ అధ్యక్షులు జనాబ్ సయ్యద్ రషీద్, గౌరవ సలహాదారు జనాబ్ వాలే బాజీ, పెద్దలు జనాబ్ షేక్ మహబూబ్ సుభాని తదితరులు పాల్గొన్నారు.









