నేటి గదర్ న్యూస్,ఖమ్మం, జనవరి 9 : అట్టడుగు వర్గాల అభ్యున్నతి అభివృద్ధి చదువుతోనే సాధ్యమని వారికి చదువు విలువ తెలియజేస్తూ అందరికీ పాఠాలు చెప్పిన తొలి సామాజిక ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ అని బీ సీ, ఎస్ సీ, ఎస్ టీ జిల్లా కార్యదర్శి సంగమేశ్వర రావు ,
వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్ర బాయి అన్నారు. శుక్రవారం రామన్నపేటలో సంఘం జిల్లా కార్యదర్శి షరీఫా బేగం ఆధ్వర్యంలో ఫాతిమా షేక్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి , నివాళులు లభించారు. అనంతరం కేక్ కట్ చేశారు. తదనంతరం జరిగిన సభలో ఉపేంద్ర బాయి మాట్లాడుతూ సత్య శోధక్ సమాజ్ వ్యవస్థాపక సభ్యురాలు , చదువుల తల్లి సావిత్రిబాయి పూలే సహచరి అందరికీ చిరపరిచితురాలైన ఫాతిమా షేక్ ఆనాటి ముస్లిం సమాజం నుండి బడుగు బలహీన వర్గాల చదువుల ఆవశ్యకతను గుర్తించి , సావిత్రిబాయి పూలే తో కలిసి , మహిళలకు చదువులు చెప్పించిన ధన్యజీవి ఫాతిమా షేక్ అని కొనియాడారు. ఫాతిమా షేక్ తో పాటు సావిత్రిబాయి పూలే వంటి రోల్ మోడల్ గా నిలిచిన మహిళల స్ఫూర్తితో మన భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారులు పుల్లూరి నాగయ్య , వీర నారీమణుల ఆశయ సాధన సమితి జిల్లాఉపా దక్షురాలు బి. జ్యోతి, ప్రధాన కార్యదర్శి స్పందన , సహాయ కార్యదర్శి కవిత , సలహాదారులు
లక్ష్మి , మహాలక్ష్మి , రమ్య , సరోజిని , కృష్ణవేణి , జిల్లా ఇన్చార్జి జాన్ బి ,మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ , బహుజన జేఏసీ నాయకులు అర్జునరావు , వీరన్న , వెంకన్న , ఎల్ హెచ్ పీ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బానోతు బద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.









