*
నేటి గదర్ న్యూస్, చింతకాని :
చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి సరైన సమయానికి హాజరుకావాలని ఆదేశించారు.
ఆరోగ్య కేంద్రం లో పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండేవిధంగా చూసుకోవాలన్నారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని కోరారు. ఔషధాల సరైన సమయానికి వస్తున్నాయా లేదా ఏదైనా కొరత ఉందా అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని ఎవరైనా వైద్యం పట్ల ప్రజల పట్ల విధులు పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా మండలంలో ఉన్న మ్యామ్ పిల్లల్ని శ్యామ్ పిల్లలను జిల్లాలో ఉన్న ఎన్ఆర్సికి పంపించవలెనని సూచించారు అదేవిధంగా సాధారణ ప్రసవాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మరియు హైరిస్కున్న కేసులను డిహెచ్ కి పంపించవలెనని సూచన చేసినారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అల్తాఫ్, సూపర్వైజర్స్
హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









