+91 95819 05907

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్:
విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన మసీదు అనంతరం ముస్లిం ఐక్య సంఘం తెలంగాణ బోనకల్ మండల అధ్యక్షులు షేక్. మహబూబ్ పాషా అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ ధార్మిక సభలో పలువురు వక్తలు మాట్లాడారు. తొలుత షేకూల్ హదీస్ జామియా ఇస్లామియా ఇషా తుల్ ఉలూమ్అక్కలకోవా (మహారాష్ట్ర ) మౌలానా విశ్వనుద్దీన్ సాహెబ్  మారుఫీ మాట్లాడుతూ పలు ఉపమానాలతో విశ్వాసం నమాజ్ సదాచారాలు మానవుల మోక్షానికి మార్గాలుగా ఉపయోగపడతాయి అన్నారు. మసీదు నిర్మాణానికి సహకరించిన సహాయపడిన లేకున్నా మసీదు నిర్మాణం పరిపుష్టి గావించేందుకు నమాజులు ఆచరించాలన్నారు.తెలుగు ప్రసంగికులు
నాజిమా జామియా రెహమాన్ p బనాద్ అమరావతి ( ఆంధ్రప్రదేశ్ ) మౌలానా అబ్దుల్ ముస్తా ఆన్ సాహెబ్ మాట్లాడుతూ మసీదులు కేవలం నమాజులకు మాత్రమే పరిమితం కాదని అవి మనలోని సోదరా భావాన్ని ,మన ఐక్యమత్యాన్ని, మన విశ్వాసాన్ని చాటి చెప్పే కేంద్రాలని అభివర్ణించారు. గ్రామ సీమలలో బహు దైవారాధన ( షి ర్క్) వంటి సామాజిక సమస్య పెరగకుండా అరికట్టడానికి , మన వ్యక్తిత్వానికి మెరుగుపరిచేందుకు, ధార్మిక విద్యను అందించడానికి  పిల్లల తల్లిదండ్రులు మసీదులకు
ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ముస్లిం ఐక్య సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా షేక్. ముజాహిద్ఇశాతి మాట్లాడుతూ చిన్న పెద్ద తారతమ్యాలు లేకుండా మసీదులో ఎవరు వచ్చినా సమాన ప్రాధాన్యత ఉంటుందని , మసీదు అనేది కేవలం నమాజ్ కు మాత్రమే పరిమితమయ్యే స్థలం కాదన్నారు. ఇక్కడ లభించే ధార్మిక  విద్య , సామాజిక తత్వం , వ్యక్తిత్వ నిర్మాణం  కు దారి తీస్తాయన్నారు. ముస్లిం ఐక్య సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ .గౌసుద్దీన్ గ్రామాలలోని ముస్లింలకు ఖురాన్ , హదిస్ ల గురించి వివరించడమే కాకుండా ఏక దైవరాధన , బహు దైవారాధన లపై అవగాహన పరచడం ప్రధాన దేహంగా ముస్లిం ఐక్య సంఘం తెలంగాణ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో  ముస్లిం ఐక్య సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు హుస్సేన్ సాహెబ్ , సెంటర్ కమిటీ సభ్యులు షేక్. జానీ మియా, మసీదు కమిటీ సభ్యులు షరీఫ్ , మండల కమిటీ సభ్యులు షాజహాన్, రఫీ, డాక్టర్. హసన్ ,ముస్తఫా, లాల్ మొహమ్మద్ , మధిర మండలం అధ్యక్షులు షేక్. గాలిబ్, ప్రధాన కార్యదర్శి షేక్. సైదులు , ముదిగొండ మండల అధ్యక్షులు మస్తాన్ ఖాన్ , ఉపాధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ , ప్రధాన కార్యదర్శి షేక్. తాజుద్దీన్ ,
వెదుపాలెం మండల అధ్యక్షులు బాసిత్ అలీ , ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !