నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ప్రారంభించారు. పార్టీ శ్రేణులు ఇంటింటికి తిరుగుతూ స్థానిక సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, సీనియర్ నాయకులు పారుపల్లి చంద్రశేఖర్ బాబు, గుడిమెట్ల రజిత, గుడిమెట్ల మోహన్ రావు, షేక్ నాగుల్ పాషా, కొంగర సుధాకర్, తోట కృష్ణవేణి, రుద్రాక్షుల నరసింహ చారి, భూక్యా విజయ, మాడపాటి సుజాత, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 40









