యువ న్యాయవాది అంకితకు ఘన సన్మానం.. తిరుమలకుంటలో బిఆర్ఎస్ నాయకుల పరామర్శ
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్ : దాది చంటి ) జనవరి, 19: అశ్వరావుపేట నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి నాయకులు సోయం వీరభద్రం సోమవారం మండలంలోని తిరుమలకుంట గ్రామంలో పర్యటించి పలువురు పార్టీ నాయకులను పరామర్శించడంతో పాటు యువ న్యాయవాదిని సత్కరించారు. ఇటీవల ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన కొనకళ్ల అంకితను ఆమె స్వగృహం వద్ద సోయం వీరభద్రం ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజంలో గొప్ప గౌరవం లభిస్తుందని, అంకిత న్యాయవాద రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం అంకిత తల్లిదండ్రులు శ్రీనివాసరావు, విజయలక్ష్మి దంపతులను కూడా ఆయన సత్కరించారు. ఈ పర్యటనలో భాగంగా బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జుజ్జరి వెంకన్నబాబును కలిసి ఆయన ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుమలకుంట సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి చెందిన మాడి ముత్యాలరావును పరామర్శించి, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు బొల్లికొండ చెన్నారావు, జుజ్జురి సత్యనారాయణ, వాడే వీరస్వామి, పానుగంటి చెన్నారావు, దాసరి రాజా, సిరిబత్తుల శ్రీనివాసరావు, కోర్సా జోగారావు, పలువురు గ్రామస్థులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.









