*పెద్ద ఎత్తున గ్రామీణ వైద్యులు తరలిరావాలి : గొల్లపల్లి రమేష్
*నేటి గదర్ న్యూస్ గుండాల*, ఈనెల 24వ తారీఖున ఖమ్మం పట్టణంలో గ్రామీణ వైద్యుల మహాసభ నిర్వహిస్తున్నామని ఈ సభకు మండలంలోని గ్రామీణ వైద్యులు పెద్ద ఎత్తున తరలిరావాలని గుండాల మండల అధ్యక్షులు గొల్లపల్లి రమేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో మహాసభ వాల్ స్టర్ను గ్రామీణ వైద్యులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ గ్రామాల్లో ఏజెన్సీ మండలాల్లో గ్రామీణ వైద్యులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలను అందిస్తున్నారని అన్నారు. ప్రజలు వైద్యం కోసం ఏ సమయంలో వచ్చిన వారికి వైద్యం అందించి ప్రజలకు తోడ్పాటుగా నిలుస్తున్నరని అన్నారు. మండలంలోని గ్రామీణ వైద్యులందరూ మహాసభకు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి టి రాము, మండల కార్యదర్శి సోలం సతీష్, కె రాములు, కే భాస్కరాచారి, ఎస్ సత్యం, ఎండి మహమూద్, సిహెచ్ రాంబాబు, నరసింహారావు, బాలు, నారాయణ, నవీన్, విజయ్,సమ్మారావు, శివాజీ తదితరులు పాల్గొన్నారు









