చేనేత కార్మికులకు నేతన్న రుణమాఫీ నిధుల విడుదల పట్ల హర్షం.
సీఎం రేవంత్ రెడ్డి , మంత్రి తుమ్మల చిత్రపటాలకు పాలాభిషేకం.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం : మంత్రివర్యులు తుమ్మల క్యాంప్ ఆఫీస్ నందు చేనేత కార్మికులకు రుణమాఫీ నిధుల విడుదల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి , మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు . ఈ సందర్భంగా రాష్ట్ర తెలంగాణా ప్రాంత పద్మశాలి సంగం అధ్యక్షులు మరియు 24 డివిజన్ కార్పొరేటర్ కమర్దపు మురళి మాట్లాడుతూ 01.04.2017 నుండి 31.03.2024 వరకు తీసుకున్న వ్యక్తిగత రుణాలకు చేనేత కార్మికులను వడ్డీ వ్యాపారులు మరియు మైక్రో ఫైనాన్స్ కంపెనీల ఒత్తిడి నుండి విముక్తి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు . పాత అప్పులు తీరడం ద్వారా బ్యాంకుల నుండి తిరిగి కొత్త ‘వర్కింగ్ క్యాపిటల్’ పొందే అవకాశం కల్పించిందన్నారు . జిల్లాలో లబ్ధిదారుల వివరాలు హనుమకొండ జిల్లాలో మొదటి విడతగా నిధుల జమ ప్రక్రియ పూర్తయింది . 6500 మందికి విడుదలైన మొత్తం రూ 49.90 కోట్లు ను జిల్లాలోని 1 ప్రధాన బ్యాంకుకు ఈ నిధులను బదిలీ చేసి నేరుగా కార్మికుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది . ఈ రుణమాఫీ చేనేత కార్మికుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని , తిరిగి ఆత్మవిశ్వాసంతో వృత్తిని కొనసాగిస్తామని తెలుపుతూ పద్మశాలి అందరూ తరఫున తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ హనుమంతరావు , కార్పొరేటర్ తోట వీరభద్రం , పెండెం జనార్ధన్ , కుసుమ హనుమంతరావు , పులిపాటి సంపత్ , చందా వీరభద్రం , గూడూరు శ్రీనివాస్ , కాముని రమేష్ , సంగిశెట్టి సత్యనారాయణ , పెంటె వెంకటేశ్వర్లు , బండారు శ్రీనివాస్ , సాదు రమేష్ రెడ్డి , ప్రసన్న కృష్ణ , నాళ్ళo సతీష్ , మాసన శివ తదితరులు పాల్గొన్నారు .









