నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్:
ఖమ్మం జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ ములకలపల్లి సంగమేశ్వరరావు అధ్యక్షతన పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక వద్ద 77వ గణతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించడమైనది . తదనంతరం రాజ్యాంగ రథయాత్ర పూలే అంబేద్కర్ వేదిక కానాపురం సెంటర్ నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ప్రదర్శన జరిగినది . ఈ కార్యక్రమానికి బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ తెలంగాణ రాష్ట్ర పౌండర్ మరియు చైర్మన్ మాన్యశ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు . భారతదేశ స్వతంత్రాన్ని బ్రిటిష్ వారి నుండి సాధించి భారత భూమికి విముక్తి కల్పించినాము కానీ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో అగ్రవర్ణాధిపత్యంలో 90% మెజారిటీ ప్రజలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందనీ అన్నారు . అంటే రాజ్యాంగాన్ని అమలు చేయడంలో పాలకులు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని ఇది నిజమైన గణతంత్రము కాదని బిసి ఎస్సి ఎస్టి 100 కోట్ల మంది పైన ఉన్న ప్రజల కోసం మరో స్వతంత్ర ఉద్యమం జరగాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కొడగంటి రాంబాబు , రాష్ట్ర కమిటీ మెంబర్ లింగన బోయిన లక్ష్మణ్ ముదిరాజ్ , జిల్లా కో – కన్వీనర్లు ఎలమందల జగదీష్ , జక్కుల రాజేష్ , కటకం వెంకటలక్ష్మి , దావ ముత్యాలరావు గౌడ్ , కొర్లపాటి రాఘవులు , ఆకారపు కోటేశ్వరరావు , నాశ బోయిన నరేష్ ముదిరాజ్ , బండి నాగేశ్వరరావు గౌడ్ , రావుల హనుమంతరావు ముదిరాజ్ , నాగేశ్వరావు యాదవ్ , నర్ల శేషయ్య ముదిరాజ్ , రామారావు గౌడ్ , పి ఆర్ దేవి , బత్తుల వీరబాబు , స్వర్ణ కుమార్ , సోమరాజు , కర్నే రామారావు , ఆంతోని సురేష్ , ఇనుప అనిల్ కుమార్ , మేడి బసవయ్య , గర్జను సలహా మండలి సభ్యులు సూర్యం , సంపత్ కుమార్ , వీరనారి మహిళలు కొలుపుల కళాకారులు ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు .









