రాజ్యాంగ రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గణతంత్రం ను స్పూర్తి గా తీసుకోవాలి
___ డాక్టర్ స్వర్ణకుమారి
నేటి గదర్ న్యూస్,ఖమ్మం జనవరి 26 : నేటి గణతంత్రం దినోత్సవాన్ని స్ఫూర్తి గా తీసుకొని మనం రాజ్యాంగ రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమాలు చేపట్టాలని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్. స్వర్ణకుమారి పిలుపునిచ్చారు.సోమవారం భారత గణతంత్ర దినోత్సవంను పురస్కరించుకొని వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను డాక్టర్. స్వర్ణకుమారి ఆవిష్కరించి , ప్రసంగించారు. అన్ని వర్గాల అభివృద్ధి ,సంక్షేమాన్ని ఆశించి , ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారని , అలాంటి రాజ్యాంగాన్ని నేటి పాలకులు తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పాలకులు అవలంబిస్తున్న విధానాల పట్ల బహుజనులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. వీళ్ళ నుండి మన రాజ్యాంగాన్ని మన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడంతో పాటు పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో అత్యధిక సంఖ్యాకులైన బహుజనులు పాలకులుగా అవతరించినప్పుడే మన సమస్యలు పరిష్కారం చెందుతాయన్నారు. ఆనాడే గణతంత్ర దినోత్సవ లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. అప్పుడే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నిజమైన నివాళి ఇప్పించిన వారవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరానారి మండల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్ర బాయి , న్యాయ సలహాదారులు షేక్. నజీమా , గౌరవ సలహాదారులు పి. నాగయ్య , ఉపాధ్యక్షురాలు బి.జ్యోతి, జిల్లా ప్రధాన కార్యదర్శి స్పందన , జిల్లా కార్యదర్శి షరీఫా బేగం , సహాయ కార్యదర్శి జాన్ బి, అధికార ప్రతినిధి బి. త్రివేణి , ఆఫీస్ ఇంచార్జి కృష్ణవేణి , బహుజన చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు దాసరి శ్రీనివాస్ , తిరుపతి , పగిడిపల్లి.నాగేశ్వరావు , పమ్మీ రవి, జంకిపల్లి రవి, సర్దార్ డి .నాగేశ్వరావు ,శ్రీనివాసచారి, దారా సంజీవరావు ,సురభి నాయక్ ,వీరన్న నాయక్, రవీందర్ నాయక్ , భవాని ,లక్ష్మీ ,అఖిల్ ,రామకృష్ణ , విజయ , యోనా, లింగయ్య, కవిత, శ్రీదేవి ,లతా, స్వాతి, సంధ్య, రాజేష్, రాంబాబు, నాగేంద్ర ,శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.









