గేటు రేలకాయల పల్లి లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…
కారేపల్లి మండలం నేటి గద్దర్ ప్రతినిధి పూనెం సుమంత్ :
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గేటు రేలకాయల పల్లి పాఠశాల నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు పాఠశాల టీచర్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం పాఠశాల టీచర్ పిల్లలకు పెన్నులు పెన్సిల్లు బాక్సులు ను పాఠశాల ఉపాధ్యాయురాలు సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ పెద్దలు ద్వారా పిల్లలకు ఇవ్వడం జరిగింది అనంతరం పాఠశాల టీచర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ రోజు ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రోజని తెలిపారు అదేవిధంగా మరోవైపు కాంగ్రెస్ పార్టీ నూతనంగా ఎన్నుకున్న గ్రామ సర్పంచ్ మంగ బన్సీలాల్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆఫీస్ జెండాను పాఠశాల నందు ఘనంగా ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం రాజ్యాంగ విలువలకు ప్రతీక ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఉప సర్పంచ్ ధర్మ సోత్ కోటేష్ గణితి రామారావు వార్డ్ నెంబర్ పూనెం సుమన్ సురేష్ మాజీ ఉప సర్పంచ్ ఈసాల సందీప్ పొడుగు అంజయ్య గ్రామపంచాయతీ వర్కర్స్ నరేష్ కిషన్ మీటీయా అంగన్వాడీ టీచర్స్ జవాజి సుజాత సునీత ఆశా వర్కర్ ఈశాల ఈశ్వరమ్మ సురేష్ నాగేంద్ర ప్రసాద్ శ్రీను తదితరులు పాల్గొన్నారు









