*గత మూడు రోజులుగా సొసైటీ మూత రైతులకు ఇబ్బందులు*
*పాలకవర్గం లేక ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఉద్యోగస్తులు*
ప్రైవేట్ షాపులను ఆశ్రయిస్తున్న రైతులు.
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) జనవరి 29.
మాసాయిపేట మండల కేంద్రంలో రైతులకు ఇబ్బంది కలగకుండా గత ప్రభుత్వం సొసైటీ గోదామును మాసాయిపేట గ్రామంలో నిర్మించి రైతులకు సరిపడా యూరియా నిల్వ చేసుకోవడానికి ఏర్పాటు చేశారు కానీ నాట్లు వేసే సమయంలో గత మూడు నాలుగు రోజులుగా సొసైటీ గోదాం ఉద్యోగస్తులు లేక మూత వేయడంతో చేసేదేం లేక రైతులు ప్రైవేట్ షాపులలో యూరియా దుక్కి మందు కొనుగోలు చేస్తున్నారు. ఒక ఉద్యోగస్తులు లీవ్ లో ఉంటే మరో ఉద్యోగస్తులు పెట్టి నడిపించే సొసైటీ కనీసం ఆ బాధ్యత మరిచి గత మూడు రోజులుగా మూత వేయడం ఎంతవరకు సమంజసం అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీ లేక బయట ఫర్టిలైజర్ షాప్ లలో అధిక రేటుకు కొనుగోలు చేయడం జరుగుతుంది. సొసైటీలో దుక్కిమందు యూరియా కొంటే రైతులకు కొంతమేర తక్కువ ధరకు వస్తుందని అదే ప్రైవేట్ షాప్ లలో కొంటే అధిక రేట్లు ఉన్నాయని రైతులు వపోతున్నారు. ఏదేమైనా ఒక సొసైటీ ఆఫీసును గత మూడు రోజులుగా మూసి వేయడం అనేది ఎంత వరకు సమంజసం అని తక్షణమే అధికారులు స్పందించి రైతులకు సొసైటీ గోదామును అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా పై అధికారులను రైతును డిమాండ్ చేశారు. వెల్దుర్తి సీఈఓ అశోక్ ని వివరణ కోరగా మాసాయిపేటలో యూరియా కొరత ఉందని రెండు మూడు రోజుల్లో యూరియా వస్తదని తెలిపారు. ప్రస్తుతానికి పాస్ పెట్ అందుబాటులో ఉందని తెలిపారు. ప్రస్తుతానికి సరిపడా ఉద్యోగస్తులు లేక ఇబ్బందులు ఉన్నాయని సీఈవో అశోక్ తెలిపారు. అందుకే మాసాయిపేటలో వేరే ఉద్యోగస్తుల్ని పంపించలేకపోయామని తెలిపారు.









