ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ‘సిట్’ నోటీసులు: దొడ్డా రమేష్ ధ్వజం
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి ) జనవరి, 30: తెలంగాణ జాతిపిత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయ కుతంత్రాలను నిరసిస్తూ దమ్మపేట మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మందలపల్లి ఎక్స్ రోడ్డుపై భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు దొడ్డా రమేష్ మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలలుగా పాలనను గాలికొదిలేసిందని, ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ప్రజల దృష్టి మళ్లించడానికి బీఆర్ఎస్ అధినాయకత్వంపై అక్రమ కేసులు బనాయించడం కాంగ్రెస్కు పరిపాటిగా మారిందని మండిపడ్డారు. 14 ఏళ్ల పోరాటంతో తెలంగాణ సాధించి, దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిన కేసీఆర్ను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే తెలంగాణ సమాజం ఊరుకోదని, హరీష్ రావు, కేటీఆర్ తర్వాత ఇప్పుడు కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం వెనుక రాజకీయ కక్ష తప్ప మరేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ భారీ నిరసన కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు, మాజీ సొసైటీ చైర్మన్ రావు జోగేశ్వరావు, మండల ఉపాధ్యక్షుడు గాజుబోయిన యేసు బాబు, యువజన విభాగ నియోజకవర్గ అధ్యక్షులు యార్లగడ్డ శ్రీనివాసరావు, నాయకపోడు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రావుల శ్రీనివాసరావు, సర్పంచ్లు కొమరం సుశీల, యట్ల రామదాసు, ఉపసర్పంచ్లు రామకృష్ణ, మహేష్, మాజీ ఎంపీటీసీ కాసిని శ్రీను, మండల నాయకులు జలగం వాసు, దేవరపల్లి అజయ్, అల్ల జంగం, తుమ్మల లక్ష్మణరావు, చీకటి రామయ్య, అడపా కృష్ణయ్య, సోయం రాజబాబు, అబ్దుల్ జిన్న, పాస్యం ప్రసాద్, కోర్స వెంకటేశ్వరావు, ఎస్సీ సెల్ నాయకులు మద్దెల పుల్లారావు, కార్మిక సంఘం నాయకులు గాజుబోయిన శ్రీనివాసరావు, కొలికపోగు ధర్మ, వార్డు సభ్యులు ఉయ్యాల వెంకటేశ్వరావు, సున్నం నరేంద్ర, వల్లెపు నాగేశ్వరావు, మడిపల్లి పోలయ్య తదితరులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.









