రేవంత్ సర్కార్పై దమ్మపేటలో ‘గులాబీ’ గర్జన: కేసీఆర్ జోలికొస్తే ఖబడ్డార్!
నియోజకవర్గ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ.. హోరెత్తిన నినాదాలు
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 01: తెలంగాణ జాతిపిత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై ఫోన్ ట్యాపింగ్ నెపంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయ కుట్రలను నిరసిస్తూ దమ్మపేట మండల కేంద్రం గులాబీమయమైంది. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు దొడ్డా రమేష్ ఆధ్వర్యంలో దమ్మపేట నుంచి మందలపల్లి వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో అశ్వారావుపేట నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొని నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల వేళ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. ఈ ఆందోళనలో వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు, మాజీ చైర్మన్ రావు జోగేశ్వరరావు, సోయం వీరభద్రం, గాజుబోయిన యేసు బాబు, యార్లగడ్డ శ్రీనివాసరావు, రావుల శ్రీనివాసరావుతో పాటు సర్పంచ్లు కొమరం సుశీల, యట్ల రామదాసు, నేతలు జలగం వాసు, తుమ్మల లక్ష్మణరావు, సోయం రాజబాబు, కాసిని శ్రీను, మద్దెల పుల్లారావు మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని “సీఎం రేవంత్ డౌన్ డౌన్” అంటూ నినదించారు. తెలంగాణ కోసం పోరాడిన నాయకుడిపై కక్షసాధింపు చర్యలు మానుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేనిపక్షంలో ప్రజా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించారు.









