గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు: పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి.
సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మైలవరపు మణికంఠ
నేటి గదర్ న్యూస్, ఖమ్మం:
ఖమ్మం మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పార్టీ బరిలోకి దిగిందని ఖమ్మం నియోజకవర్గం సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మైలవరపు మణికంఠ తెలిపారు . జనసేన పార్టీ అధ్యక్షులు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ బరిలో ఉంది అని వెల్లడించారు . తెలంగాణ రాష్ట్ర జనసేన నాయకుల సూచనలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల కో-ఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ మార్గదర్శకత్వంలోఖమ్మం ఏదిలాపురం మున్సిపాలిటీ లో జనసేన పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని కోరారు . జనసేన అభ్యర్థుల వివరాలు 4వ వార్డు అభ్యర్థి శ్రీమతి కొమ్ము లక్ష్మి , 7వ వార్డు అభ్యర్థి శ్రీమతి జర్పుల నీలిమ , 27వ వార్డు అభ్యర్థి శ్రీ గుగులత్ రఘురాం , 28వ వార్డు అభ్యర్థి శ్రీ దండి సుధాకర్ , 29వ వార్డు అభ్యర్థి శ్రీమతి హనుమంతు మౌనిక లు బలమైన అభ్యర్థులతో బరిలో ఉన్నారు తెలిపారు . గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో జనసేన పార్టీ సాధించిన ఫలితాలు ప్రజల్లో పార్టీపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు . ఈ ఎన్నికల్లో కూడా ప్రజా సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకొని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు . మున్సిపల్ ఎన్నికల్లో యువతకు , స్వతంత్రులకు , నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తూ , రిజర్వేషన్ల వారీగా వారి వార్డుల్లో జనసేన పార్టీ తరఫున అభ్యర్థులను ఎంపిక చేశారు అని తెలిపారు . నేటి రాజకీయాల్లో ఇతర పార్టీలు పేరుతో , ప్రచార వ్యయాల పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేయించి అభ్యర్థులను అప్పులపాలు చేస్తున్నాయని విమర్శించారు . నిజాయితీ గల పరిపాలన విధానానికి నాంది పలుకుతూ ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా సామాన్య ప్రజలపై దృష్టి సారించి పరిపాలనలో మార్పు తీసుకురావడమే జనసేన లక్ష్యమని మా అభ్యర్థులు పనిచేస్తారని తెలియజేశారు.









