విశ్రాంత వీరుల అరెస్టులు బాధాకరం.
పెన్షనర్స్ యూనియన్ నాయకుల ఖండన.
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
2024 మార్చి మార్చి తర్వాత రిటైర్అయినటువంటిఉద్యోగస్తులయొక్కజిపిఎఫ్,గ్రాటివిటీ, కమిటేషన్ ,ఈఎల్ ఎన్కాష్మెంటు మొదలగున్నవి ప్రభుత్వం ఇవ్వకుండా 63 సంవత్సరాలు పైబడిన వారిని అక్రమంగా అరెస్టు చేయటాన్ని తమ సంఘం ఖండిస్తుందని వారు తెలిపారు.రిటైర్మెంట్ అయిన వెంటనే ఇవ్వాల్సిన బకాయిలను ప్రభుత్వం 23 నెలలు అయినప్పటికీ ఇంతవరకు రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని వారు విమర్శించారు. బక్క జడ్సన్ నాయకత్వంలో పెన్షనర్లు గవర్నర్ ను కలవడానికి రాజభవన్ కి శాంతియుతంగా వెళ్తుంటే వృద్ధులు అని చూడకుండా అక్రమంగా అరెస్టు చేయటం శోచనీయమని వారు విమర్శించారు .అనేకమంది పెన్షనర్లను హైదరాబాద్ వెళ్లకుండా అక్రమంగా స్థానిక పోలీస్ స్టేషన్లో అరెస్టులు చేయటం ప్రభుత్వానికి మంచిది కాదని వారు వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఏకకాలంలో నిధులు విడుదల చేయాలని, అలాగే అరెస్టు అయిన వారిని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు అంబటి శాంతయ్య, ఎండి రహముద్దీన్, పొన్నం
రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.









