ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై జిల్లా కలెక్టర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు
నేటి గదర్ న్యూస్, ఖమ్మం:
మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ, ప్రభుత్వ ఉద్యోగస్తులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉద్యోగ సంఘాల నేతలతో రాష్ట్ర గృహ నిర్మాణ , రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ఉమ్మడి ఖమ్మం జిల్లా MLC, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్ ,మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి తో కలిసి జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి కు ఫిర్యాదు చేశారు.
ఎన్నికల సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని , ఉద్యోగ సంఘాల నేతలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని పేర్కొంటూ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే, ఉద్యోగ సంఘాల నేతల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించిన వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరిపి, టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్న అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరారు.








