జేఈఈ మెయిన్స్లో అశ్వారావుపేట ఆణిముత్యం: రక్షిత శ్రీ అద్భుత విజయం!
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్:దాది చంటి) ఫిబ్రవరి, 18: భవిష్యత్తు ఆశావహులైన ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటకు చెందిన కట్రం రక్షిత శ్రీ తన అసాధారణ ప్రతిభతో జాతీయ స్థాయిలో సత్తా చాటారు. కేవలం అంకెలే కాకుండా తన పట్టుదలను నిరూపిస్తూ 95.699 పర్సంటైల్ సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్న ఈమె, అశ్వారావుపేట టీడీపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కట్రం స్వామి దొర మరియు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రాజేశ్వరి దంపతుల కుమార్తె. ప్రస్తుతం హైదరాబాద్ మియాపూర్లోని ఫిడ్జీ కళాశాలలో అత్యంత క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తున్న రక్షిత శ్రీ, గ్రామీణ నేపథ్యం నుండి వచ్చి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంతటి ఘనత సాధించడం విశేషం. ఆమె సాధించిన ఈ విజయంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ అభినందనల వెల్లువ కురిపిస్తున్నారు.









