+91 95819 05907

సంత్ సేవాలాల్ జీవిత చరిత్ర పాఠ్యాంశంగా చేర్చాలి ______ రిటైర్డ్ హైకోర్టు జడ్జి  చంద్రకుమార్

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : లంబాడీలా ఆరాధ్యడు ,  సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు అందజేసేందుకు గాను ఒక పాఠ్యాంశం గా చేర్చాలని రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రకుమార్ అన్నారు.  వీరనారీ మణుల ఆశయ సాధన సమితి జిల్లా కార్యాలయంలో  బుధవారం లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బానోత్ బద్రు నాయక్ అధ్యక్షతన సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు, అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ లంబాడీల ఐక్యతకు వారి సంస్కృతి , సాంప్రదాయ రక్షణకు సేవాలాల్ జీవితాంతం పాటుపడ్డారని కొనియాడారు. బంజారాస్ పేరుతో  దేశంలో దేశ దిమ్మరులుగా వలసలు పోతూ , జీవించే లంబాడీలకు ఒక దిశ నిర్దేశాన్ని కల్పించిన మహనీయుడు, సామాజిక విప్లవకారుడు  సేవాలాల్ అని పేర్కొన్నారు. తండాల లో  నేడు స్థిర నివాసం ఏర్పరచూ జీవిస్తున్న లంబాడీలు ప్రస్తుతంసామాజికంగా , రాజకీయంగా  ఎదుగుతున్నారంటే సేవాలాల్ , లంబాడి జాతికి చేసిన సేవలే కారణమన్నారు. లంబాడీల అభివృద్ధికి అభ్యున్నతికి ఆయన అనేక నైతిక అంశాలలో చూపిన మార్గం సదా అనుసర అనుసరణీయమన్నారు. అటువంటి మహానీయుడి జయంతి , వర్ధంతిలా కార్యక్రమాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని సూచించారు.
లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బానోతు బద్రు నాయక్  తమ సంఘం లంబాడీల హక్కుల సాధన తో పాటు వారి సంస్కృతి సాంప్రదాయాలను  పరిరక్షిస్తూ  , సంత్ సేవాలాల్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నాం అంటూ సేవాలాల్ జీవిత చరిత్రను  పాఠ్యాంశంగా చేర్చాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్ర బాయి , జిల్లా కార్యదర్శి స్పందన , న్యాయ సలహాదారులు షేక్. నజీమా , సహాయ కార్యదర్శి షరీఫా బేగం , ఆఫీస్ ఇంచార్జి  బానోతు కృష్ణవేణి , జిల్లా ఉపాధ్యక్షురాలు బి. జ్యోతి , సలహాదారులు కే .లక్ష్మి , శృతి ,న్యాయవాది వి. లక్ష్మీనారాయణ , బహుజన జేఏసీ , సావిత్రిబాయి పూలే కమిటీల నాయకులు దాసరి శ్రీనివాస్ , నకరికంటి సంజీవరావు , బి. వెంకటేశ్వర్లు , సురభి నాయక్ , వీరన్న నాయక్, ,శ్రీనివాస చారి , ప్రకాష్ ,రవీందర్ ,నాగేశ్వరావు, రమేష్ ,జాన్ భీ  ,త్రివేణి , వెంకటనారాయణ , సరోజని , ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కోరుట్లలో బురఖా ధరించిన వ్యక్తి బస్సు ప్రయాణం –

కోరుట్లలో బురఖా ధరించిన వ్యక్తి బస్సు ప్రయాణం – అపోహలతో ఉద్రిక్తత కోరుట్ల, ఫిబ్రవరి 17 కోరుట్ల పట్టణంలో మంగళవారం బురఖా ధరించి ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించాడన్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Read More »

రంజాన్ కు ముస్తాబైన అశ్వాపురం జామా మసీద్… — రంగురంగుల విద్యుత్ కాంతులతో మసీదుకు శోభాయానం.

రంజాన్ కు ముస్తాబైన అశ్వాపురం జామా మసీద్… — రంగురంగుల విద్యుత్ కాంతులతో మసీదుకు శోభాయానం. అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండల కేంద్రంలోని జామా మసీదును గురువారం ప్రారంభమయ్యే రంజాన్ మాసంను

Read More »

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ

*పత్రికా ప్రకటన 18.02.2026* *👉బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ..* *👉కుటుంబ సభ్యులకు 25 కేజీల బియ్యం అందించిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.* ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కరకగూడెం

Read More »

సుందరయ్య నగరాన్ని తీర్చి దిద్దుతున్న సర్పంచ్ కిషోర్ నాయక్ వారికి ప్రత్యేకమైన అభినందనలు :సిపిఎం

18/2/2026 సారపాక మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 లో డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో గూగు లోత్ కిషోర్ శివరాం నాయక్ సుందరయ్య నగర్ ప్రజలకు సిపిఎం పార్టీకి స్పష్టమైన హామీ ఇచ్చారు నన్ను

Read More »

గుండెపోటుతో వ్యక్తి మృతి

గుండెపోటుతో వ్యక్తి మృతి కారేపల్లి, గుండెపోటుతో వ్యక్తి మతి చెందిన ఘటన కారేపల్లి మండలం దుబ్బతండాలో బుధవారం చోటుచేసుకుంది. దుబ్బతండాకు చెందిన భూక్య శ్రీను(38) మణుగూరు లో బంధువుల ఇంటికి పనిపై వెళ్లాడు. అక్కడ

Read More »

రేగా సైన్యం వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

రేగా సైన్యం వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం పినపాక పినపాక మండలం పొట్లపల్లి గ్రామంలో రేగా సైన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రేగా

Read More »

 Don't Miss this News !