ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో రిటైర్డ్ ఎస్సై మృతి
ఉద్యోగ విరమణ చేసి ఏడాది దాటుతున్నా బకాయిలు అందకపోవడంతో మొదలైన ఆర్థిక ఇబ్బందులకు అనారోగ్యం తోడు కావడంతో రిటైర్డ్ ఏఆర్ ఎస్సై మృతి
ఖమ్మం పోలీస్ సాయుధ దళంలో ఎస్ఐగా పనిచేసి గత ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ పొందిన కె.మైసయ్య
ఆయన ఉద్యోగ విరమణ బకాయిలు సుమారు రూ.50-60 లక్షలు రావాల్సి ఉండగా అవి ఇప్పటికీ అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న కుటుంబం
ఈక్రమంలో మైసయ్యతోపాటు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన భార్య భాగ్యమ్మ
వీరిద్దరిని బుధవారం రాత్రి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా భార్యను మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్కి తరలింపు
పరిస్థితి విషమించడంతో మైసయ్య బుధవారం అర్ధరాత్రి దాటాక మృతి
అయితే ఆసుపత్రి బిల్లులకు ఇబ్బందిగా ఉందని తెలియడంతో కొంతమేర బిల్లు చెల్లించి, మృతదేహాన్ని ఆయన ఇంటికి పంపిన విశ్రాంత పోలీస్ అధికారుల సంఘం








