కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలి:వీరనారీమణుల సంఘం
నేటి గదర్ న్యూస్, ఖమ్మం :
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామం మల్లన్న జాతరలో రజకులపై దాడి చేసి రెండు నెలల చిన్నారి పసిపాపను హత్య చేసినటువంటి రెడ్డి కులస్తులపై మర్డర్ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వీరనారీమణుల సంఘం అధ్యక్షురాలు ఉపేంద్ర భాయి అన్నారు.
ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ మల్లన్న జాతరలో దేవదర్శనానికి వెళ్లినటువంటి చాకలి కులస్తులపై విచక్షణంగా దాడి చేసి మహిళలను అసభ్య పదజాలంతో దూషిస్తూ తీవ్రంగా దాడి చేసి, రెండు నెలల పసి పాపను హత్య చేసినటువంటి కుమ్మెర గ్రామ రెడ్డి కులస్తులపై మర్డర్ కేసు నమోదు చేసి తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా భాదిత కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల ఎక్సిగ్రెసియా,ఒక ప్రభుత్వం ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు, మరియు వారికి పోలీసు రక్షణ కల్పించి న్యాయం చేయాలనీ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి స్పందన ఉపాధ్యక్షురాలు జ్యోతి ఆఫీస్ ఇన్చార్జి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు








