నేటి గదర్ న్యూస్, వైరా:
ఖమ్మం జిల్లా కేంద్రం వెలుగుమట్ల ప్రాంతంలో గత పది సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నిరుపేదల గుడిసెలను బలవంతంగా కూల్చివేయడం దుర్మార్గమైన చర్య. భూదాన్ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను ధ్వంసం చేసి, పోలీసు బలగాలతో రెవెన్యూ యంత్రాంగం ఖాళీ చేయించడం మానవ హక్కుల ఉల్లంఘనగా సీపీఎం తీవ్రంగా ఖండిస్తుంది. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం తెలిపారు.
ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యం అనే ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై దౌర్జన్యానికి పాల్పడటం అన్యాయం. రాజ్యాంగబద్ధంగా ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది. భూదాన్ భూములపై ప్రభుత్వానికి ఏకపక్ష హక్కులు లేవు. పది సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న పేదలను రోడ్డున పడేయడం అమానుషం.
ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి భూదాన్ భూముల్లోనే పేదలకు శాశ్వత గృహ నిర్మాణం చేపట్టి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి. నిరాశ్రయులైన కుటుంబాలకు తక్షణమే తగిన నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.
పేదల పక్షాన సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తుంది.వైరాలో మీడియా తో భూక్యా వీరభద్రం తెలిపారు.








