*
నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :
ఖమ్మం- బోనకల్ ప్రధాన రహదారి అయిన మత్కేపల్లి బస్ స్టాప్ వద్ద ముదిగొండ మండలానికి,జగన్నాధపురం గ్రామానికి మరియు చింతకాని మండలానికి వెళ్లే రింగ్ వద్ద నూతనంగా నిర్మించిన రోడ్డు…తరచూ ప్రమాదాలు జరుగుతున్నవి. ప్రజలు నిత్యం జీవనం చేస్తూ..జగన్నాధపురం గ్రామంలోకి మరియు చింతకాని వెళ్ళటానికి, మరియు మత్కేపల్లి మీదగా ముదిగొండ చేరుకోవటానికి వేసిన రోడ్డుకు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయకపోవడం ,ప్రమాదక హెచ్చరిక బోర్డులను లేకపోవడం వల్ల నిత్యం అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రమాదాల బారిన పడినవారు, ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆర్ అండ్ బి అధికారులు స్పందించి వెంటనే అక్కడ ( వాహనాలు నిదానంగా వెళ్లే సదుపాయం) బలమైన స్పీడ్ బ్రేకర్స్ ను ఏర్పాటు చేయాలని, ప్రమాదక హెచ్చరికలు బోర్డులను పెట్టాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని, వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు .








