+91 95819 05907

ప్రశాంతంగా జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రశాంతంగా జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం :
జిల్లాలో పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.శనివారం జిల్లా కలెక్టర్, రాజేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రకాష్ నగర్ రోడ్ లోని మౌంట్ ఫోర్ట్ స్కూల్ లలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి, పరీక్ష జరుగుతున్న తీరు, పరీక్షా కేంద్రాలలో నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు చల్లని త్రాగు నీరు సరఫరా చేయాలని, పరీక్ష కేంద్రానికి వచ్చే ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించాలని తెలిపారు.
పరీక్ష గదుల్లో వెలుతురు, త్రాగునీరు, టాయిలెట్ నిర్వహణ సక్రమంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసు కోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కేంద్రంలోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ సక్రమంగా కొనసాగాలని సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని దైర్యం చెప్పారు. పరీక్షా సిబ్బంది తమ విధులను నిబద్ధతతో, బాధ్యతగా నిర్వహించాలని, ఎలాంటి ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.శనివారం జిల్లాలో జరిగిన పదవ తరగతి పరీక్షకు 99.88 శాతం విద్యార్థులు హాజరు కావడం జరిగిందని, 16 వేల 962 విద్యార్థులకు గాను మొత్తం 16 వేల 941 మంది విద్యార్థులు హాజరు అయ్యారని తెలిపారు. జిల్లా కలెక్టర్ పరీక్షా కేంద్రం తనిఖీ సమయంలో సంబంధిత అధికారులు వెంట ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన సర్పంచ్, ఉప సర్పంచ్ …

కారేపల్లి మండలం నేటి గద్దర్ ప్రతినిధి పూనెంసుమంత్ కారేపల్లి మండలం గేటు రేలకాయల పల్లి గ్రామానికి చెందిన కలితి భద్రమ్మ (83) అనారోగ్యంతో గురువారం నాడు మృతి చెందారు స్థానిక గ్రామ సర్పంచ్ ఉప

Read More »

పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత ఆటో సేవ : సోషల్ వర్కర్ లతీఫ్ ◆గర్భిణీ స్త్రీలకు ఉచితంగా 24 గంటలు ఆటో సర్వీస్ చేయబడును ఫోన్ నెంబర్ 9603747878 కి ఫోన్ చేయగలరు

పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత ఆటో సేవ : సోషల్ వర్కర్ లతీఫ్ నేటి గదర్ న్యూస్, వైరా : వైరా మండలం , సిరిపురం కేజీ, గ్రామ వాసి సోషల్

Read More »

ప్రశాంతంగా జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రశాంతంగా జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నేటి గదర్ న్యూస్, ఖమ్మం : జిల్లాలో పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ అనుదీప్

Read More »

ఘనంగా ఉపవాస కూడికలు.

ఘనంగా ఉపవాస కూడికలు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : వైరా మున్సిపాలిటీ పరిధిలోని మొదటి వార్డ్ ఆర్.సి.యం చర్చి ప్రాంగణంలో ఆర్.సి.యం వన్ మరియు సెయింట్ జోసెఫ్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో..

Read More »

బ్రేకింగ్ న్యూస్ *అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి పరీక్షకు హాజరైన కొడుకు*

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 14. మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరిలకాపల్లి గ్రామ శివారులో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో శివంపేట మండలం పంబండ గ్రామానికి చెందిన కుమ్మరి

Read More »

తీవ్ర మనోవేదనకు గురవుతున్న రిటైర్డ్ ఉద్యోగులు.

పి ఆర్ పి ఏ జిల్లా కన్వీనర్ యలమద్ది వెంకటేశ్వర్లు వైవి నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : నాగులవంచ లో జరిగిన పి ఆర్ పి ఎ ముఖ్య కార్యకర్తల సమావేశంలో

Read More »

 Don't Miss this News !