బీజేపీ రైతు ,కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి
* చంద్రుగొండ మండల బంద్ విజయవంతం
* అఖిలపక్ష నాయకులు సూరా వెంకటేశ్వర్లు
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
కేంద్రం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ దేశంలో గ్రామీణ భారత్ బంద్ కు సంయుక్త కిషన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాలు పిలుపుమేరకు శుక్రవారం చండ్రుగొండ మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ టౌన్ పార్టీ అధ్యక్షులు సురా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బందుకు మద్దతు తెలియజేయడం జరిగింది. వ్యాపారస్తులు ప్రజలు స్వచ్ఛందంగా బందుకు మద్దతు తెలపడం జరిగింది .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించిన మూడు వ్యవసాయ చట్టాలను బిజెపి ప్రభుత్వం రద్దు చేయాలని, పంటలకు కనీస ధర గ్యారెంటీ చేసే చట్టాన్ని తెస్తామని, 2021 విద్యుత్ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకుంటామని రైతు ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వ హామీని అమలు చేయాలని కోరినా ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. దీంతో రైతులు మళ్లీ ఉద్యమించారని. రైతులపై టియర్ గ్యాస్, చెవులు దెబ్బతినేలా శబ్దాలు, వాటర్ గన్లు, రోడ్లపై మేకులు, గుంతలు తవ్వడం వంటి అడ్డంకులు సృష్టించడంతోపాటు లాఠీఛార్జ్ చేస్తూ రైతులను తీవ్రంగా గాయపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు దడిగల మల్లేష్ , భూపతి రమేష్ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ గడ్డం శ్రీను ఏజెన్సీ దళిత సేవా సంఘం మండల అధ్యక్షులు కొండ్రు నాగరాజు ఎస్టీ సెల్ మండల ఉపాధ్యక్షులు కే లోతు శ్రీనివాస్ నాయక్ , యువజన నాయకులు గద్దల విజయ్ పోతురాజు రాజా తదితర పార్టీ నాయకులు
కార్యకర్తలు ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
