+91 95819 05907

బీజేపీ రైతు ,కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి

బీజేపీ రైతు ,కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి
* చంద్రుగొండ మండల బంద్ విజయవంతం
* అఖిలపక్ష నాయకులు సూరా వెంకటేశ్వర్లు
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
కేంద్రం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ దేశంలో గ్రామీణ భారత్ బంద్ కు సంయుక్త కిషన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాలు పిలుపుమేరకు శుక్రవారం చండ్రుగొండ మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ టౌన్ పార్టీ అధ్యక్షులు సురా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బందుకు మద్దతు తెలియజేయడం జరిగింది. వ్యాపారస్తులు ప్రజలు స్వచ్ఛందంగా బందుకు మద్దతు తెలపడం జరిగింది .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించిన మూడు వ్యవసాయ చట్టాలను బిజెపి ప్రభుత్వం రద్దు చేయాలని, పంటలకు కనీస ధర గ్యారెంటీ చేసే చట్టాన్ని తెస్తామని, 2021 విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకుంటామని రైతు ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వ హామీని అమలు చేయాలని కోరినా ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. దీంతో రైతులు మళ్లీ ఉద్యమించారని. రైతులపై టియర్‌ గ్యాస్‌, చెవులు దెబ్బతినేలా శబ్దాలు, వాటర్‌ గన్‌లు, రోడ్లపై మేకులు, గుంతలు తవ్వడం వంటి అడ్డంకులు సృష్టించడంతోపాటు లాఠీఛార్జ్‌ చేస్తూ రైతులను తీవ్రంగా గాయపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు దడిగల మల్లేష్ , భూపతి రమేష్ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ గడ్డం శ్రీను ఏజెన్సీ దళిత సేవా సంఘం మండల అధ్యక్షులు కొండ్రు నాగరాజు ఎస్టీ సెల్ మండల ఉపాధ్యక్షులు కే లోతు శ్రీనివాస్ నాయక్ , యువజన నాయకులు గద్దల విజయ్ పోతురాజు రాజా తదితర పార్టీ నాయకులు
కార్యకర్తలు ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఏసీబీ అలజడి

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ చెలామణీలపై పలువురు చేసిన ఫిర్యాదులు ఈ దాడులకు కారణమయ్యాయి. ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు

Read More »

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల కేంద్రంలోని మాజీ వైస్ ఎంపీపీ బండి రత్నాకర్ చనిపోయి నేటికి 20

Read More »

జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర చిన్నపిల్లలకు ఆదర్శం కావాలి.

మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,,చింతకాని ప్రతినిధి: భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు జీవిత చరిత్ర చిన్నపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు కోరినారు.

Read More »

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వేషధారణలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

Read More »

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది ◆ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు:మంత్రి పొంగులేటి

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది. ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు.. దశాబ్దకాలం జరిగిన విద్వంసాన్ని చక్కదిద్దే కాంగ్రెస్ పైనే ప్రజల నమ్మకం. ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి

Read More »

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్.

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్. వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం

Read More »

 Don't Miss this News !