+91 95819 05907

బీజేపీ రైతు ,కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి

బీజేపీ రైతు ,కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి
* చంద్రుగొండ మండల బంద్ విజయవంతం
* అఖిలపక్ష నాయకులు సూరా వెంకటేశ్వర్లు
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
కేంద్రం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ దేశంలో గ్రామీణ భారత్ బంద్ కు సంయుక్త కిషన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాలు పిలుపుమేరకు శుక్రవారం చండ్రుగొండ మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ టౌన్ పార్టీ అధ్యక్షులు సురా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బందుకు మద్దతు తెలియజేయడం జరిగింది. వ్యాపారస్తులు ప్రజలు స్వచ్ఛందంగా బందుకు మద్దతు తెలపడం జరిగింది .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించిన మూడు వ్యవసాయ చట్టాలను బిజెపి ప్రభుత్వం రద్దు చేయాలని, పంటలకు కనీస ధర గ్యారెంటీ చేసే చట్టాన్ని తెస్తామని, 2021 విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకుంటామని రైతు ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వ హామీని అమలు చేయాలని కోరినా ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. దీంతో రైతులు మళ్లీ ఉద్యమించారని. రైతులపై టియర్‌ గ్యాస్‌, చెవులు దెబ్బతినేలా శబ్దాలు, వాటర్‌ గన్‌లు, రోడ్లపై మేకులు, గుంతలు తవ్వడం వంటి అడ్డంకులు సృష్టించడంతోపాటు లాఠీఛార్జ్‌ చేస్తూ రైతులను తీవ్రంగా గాయపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు దడిగల మల్లేష్ , భూపతి రమేష్ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ గడ్డం శ్రీను ఏజెన్సీ దళిత సేవా సంఘం మండల అధ్యక్షులు కొండ్రు నాగరాజు ఎస్టీ సెల్ మండల ఉపాధ్యక్షులు కే లోతు శ్రీనివాస్ నాయక్ , యువజన నాయకులు గద్దల విజయ్ పోతురాజు రాజా తదితర పార్టీ నాయకులు
కార్యకర్తలు ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

నేటి గదర్ వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత తొలిరోజు హైదరాబాద్ నుంచి

Read More »

 Don't Miss this News !