+91 95819 05907

BCM:CM సార్ ఆ అక్రమ ఇసుక ర్యాంపుపై చర్యలు తీసుకోరా? Cpi ml mass line

★ అక్రమ ఇసుక రవాణా కి అడ్డుకట్ట వేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకోవాలి

★ ముఖ్యమంత్రి హామీకి తూట్లు బోడుస్తున్న స్థానిక అధికారులు

★కాల పరిమితి అయిపోయిన తూరుబాక ఇసుక ర్యాంపులో లూటీ అవుతున్న ప్రజా సంపద…

★ యదేచ్ఛగా సాగుతున్న జీరో బండ్ల దందా

★ అనుమతులను మించి డంపు చేసిన ఇసుక

★అనుమతి లేకుండా అదనపు డంపింగ్ పాయింట్లను ఏర్పాటు చేసిన వైనం

★పట్టించుకోని మండల రెవిన్యూ అధికారులు

★ చోద్యం చూస్తున్నTSMDC, మైనింగ్ అధికారులు

★కలెక్టర్ స్పందించి ప్రజా సంపదను కాపాడాలి

★ రెన్యువల్ లేకుండా నడుపుతున్న తూరుబాక ఇసుక ర్యాంపుని రద్దు చేయాలి

★Cpi ml mass line ప్రజాపందా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్

నేటి గద్దర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:

భద్రాచలం పట్టణ కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండ చరణ్ మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణాన్ని నిలిపివేస్తానని గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు దుమ్ముగూడెం మండలంలో తూరుబాకలో ఉన్న ర్యాంపులో ప్రజా సంపద అయిన ఇసుక లూటీకి గురవుతుందని ఆరోపించారు ఈ ర్యాంపు పరిమిషన్ అయిపోయి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇప్పుడు కూడా ఇసుక తోలకాలు జరుగుతున్నాయని అన్నారు కాల పరిమితి అయిపోయిన ర్యాంపు ఏ విధంగా కొనసాగుతుందని ప్రశ్నించారు అనుమతికి మించిన ఇసుకను డంపు చేశారని జీరో బండ్ల ద్వారా అక్రమంగా ఆ ఇసుకను తరలిస్తున్నారని అన్నారు డంపు పాయింటు అనుమతి ఒకచోట ఉంటే అదనంగా రెండు చోట్ల డంపింగ్లు పాయింట్లు చేస్తున్నారని అన్నారు ఇంత జరుగుతున్న మండల రెవెన్యూ అధికారులు టిఎస్ఎండిసి మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం సూచనీయమని అన్నారు మండలంలో చిన్నచితిక ఒకటి రెండు ట్రక్కుల ఇసుక అక్రమంగా స్థూలకాలు జరిపితే స్పందిస్తున్నటువంటి మండల రెవెన్యూ అధికారి లారీలకు లారీల ఇసుక అక్రమంగా తరలి వెళ్తుంటే ఎందుకు పట్టించుకోవడంలేదని విమర్శించారు ఈ ర్యాంపుకు సంబంధించినటువంటి అన్ని అనుమతులు వాటికి సంబంధించినటువంటి వివరాలు బహిర్గత పరచాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా తక్షణం కలెక్టర్ గారు స్పందించి జరుగుతున్న ఈ ప్రజా సంపదలు ఊటీని ఆపాలని కాల పరిమితి అయిపోయిన తూర్బాక ఇసుక ర్యాంపుని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల కచ్చితంగా పోరాటాల నిర్వహిస్తామని హెచ్చరించారు పార్టీ నాయకులు దాసరి సాయన్న ,మునిగల శివ, బోడా.సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !